20 రోజుల చికిత్స కోసం కేరళకు పవన్ కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం (ఆగస్టు 21) కేరళకు వెళ్లనున్నారు. అక్కడి ఆయుర్వేద–ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో దాదాపు 20 రోజుల పాటు ప్రత్యేక చికిత్స, విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్, గత కొంతకాలంగా ఆరోగ్య సంబంధిత సమస్యల నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు ఈ చికిత్స తీసుకోనున్నట్లు వార్తలు వెల్లడించాయి.



