కోటి రూపాయలతో ఆస్పత్రికి కొత్త హంగులు
నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధికి దాతలు డీఎస్ఆర్ రఘురాం రెడ్డి, ఇస్కాన్ రామకృష్ణారెడ్డి సొంత నిధులు రూ.కోటి అందించారు. ఈ నిధులతో రెండు ఏసీ రెస్ట్హౌస్లు, ఆర్వో వాటర్ ప్లాంట్, టాయిలెట్ల రెన్యువేషన్ పనులకు పీహెచ్డీ స్కాలర్ మల్లెల శ్రీహరి చేత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి శంకుస్థాపన చేయించారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.


