Tuesday, 15 September 2026

Tag: E-Crop Booking

గుంటూరు

పంట వేయని రైతులకు సబ్సిడీ విత్తనాలు

ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు పంటలు వేయని రైతులకు స్వల్పకాలిక అపరాల విత్తనాలైన మినుములు, పెసలు, కంది విత్తనాలను సబ్సిడీపై అందించనున్నట్లు గుంటూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్. మోహన్‌రావు తెలిపారు. వట్టిచెరుకూరులో నిర్వహించిన ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి విత్తనాలు పొందాలని సూచించారు. ప్రతి రైతు ఫార్మర్‌ ఐడీ కలిగి ఉండటంతో పాటు ఈ-క్రాప్‌ బుకింగ్‌, ఈ-కేవైసీ పూర్తి చేయాలని తెలిపారు. ఎరువులను శాస్త్రవేత్తల సూచన మేరకే వినియోగించాలని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో యూరియా, డీఏపీ నిల్వలను అధికారులు పరిశీలించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.