కౌండిన్య గోత్రికుల ఐక్యతకు కృషి చేస్తున్న శ్రీపతి ప్రభాకర్కు జన్మదిన శుభాకాంక్షలు
భూపాలపల్లి 17,ఆగస్టు (పున్నమి ప్రతినిధి): కౌండిన్య గోత్రికులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, “మీకు నేను ఉన్నాను” అనే భరోసాను కల్పిస్తూ, ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ ఐకమత్యం, అనురాగం, ప్రేమాభిమానాలను పెంపొందిస్తున్న శ్రీపతి ప్రభాకర్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని మదర్ తెరిసా మీడియా ఎక్సలెన్సీ అవార్డ్స్ భూపాలపల్లి చైర్మన్ బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలిపారు. గౌడ కులస్తుల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి, వారి ఐక్యత, అభివృద్ధి కోసం నాయకత్వం వహిస్తూ శ్రీపతి ప్రభాకర్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు, అవసరమైన సమయంలో ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండటం స్ఫూర్తిదాయకమన్నారు. శ్రీపతి ప్రభాకర్ గారి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తరించి, సమాజ అభ్యున్నతికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ చైర్మన్, మదర్ తెరిసా మీడియా ఎక్సలెన్సీ అవార్డ్స్, భూపాలపల్లి


