మానసిక ఆరోగ్యానికి చేయూత: డా. ఉదయ్ కుమార్
ముత్తుకూరు మండలం మదరసా గూడూరులో 66వ ఉచిత మానసిక ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న 72 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సలహాలతో పాటు ఉచితంగా మందులు అందించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు మానసిక ఆరోగ్య సేవలను చేరువ చేయడమే లక్ష్యమని భారతీయ మానసిక వైద్యుల సంఘం సామాజిక మానసిక వైద్య విభాగం సలహాదారులు డా. కడివేటి ఉదయ్ కుమార్ తెలిపారు.


