ఇంటింటికీ తెలుగుదేశం.. ప్రజలతో మమేకమైన ఎరిక్షన్ బాబు
దోర్నాల మండలం కటకానిపల్లిలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామ సమావేశంలో తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలపై వివరించారు. మండల టీడీపీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ సాహెబ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు కూడా పాల్గొని గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు.


