రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి 03/072026
ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన లబ్ధిదారులు మందాటి మౌనిక–బాలెలం కుటుంబం నూతన గృహంలో గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్జల రాజు ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సొంత ఇంటి కల నెరవేరడం ఆనందదాయకమని పేర్కొంటూ, గృహప్రవేశం చేసిన కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విజయ్, వార్డు సభ్యుడు నరేష్, గూడూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు చాకలి బాబు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోవర్ధన్, వార్డు సభ్యుడు కాసులవాద శ్రీనివాస్, రాజు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొని గృహప్రవేశం చేసిన మందటి మౌనిక–బాలెలం కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.


