Sunday, 12 July 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అన్నదాత సుఖీభవ పథకం కి దరఖాస్తు చేసుకోండి:- తాసిల్దార్

అన్నదాత సుఖీభవ పథకం కి దరఖాస్తు చేసుకోండి:- తాసిల్దార్ సీతారాంపురం మండలం అన్నదాత సుఖీభవ పథకంలో పేరు నమోదయి ఉండి వివిధ కారణాల దృశ్య నగదు జమ కాని రైతులు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తాసిల్దార్ పి.వి. కృష్ణారెడ్డి తెలిపారు.540 మంది రైతులు మరణించినట్లు జాబితా వచ్చిందన్నారు. వారసులు సంబంధిత పత్రాలతో పాటు మరణ ధ్రువీకరణ పత్రం. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్. కుటుంబ బాగా పంపకాల దస్తాలు తీసుకొని సంబంధిత విఆర్ఓలకు అందిస్తే త్వరగా జమ అవుతుంది అని ఆయన పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇస్కాన్ లో చిన్నారులకు పోటీలు

పున్నమి ప్రతినిధి( శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) నెల్లూరులోని ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం) మందిరంలో ఆదివారం రోజున త్వరలో జరుపబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను పురస్కరించుకొని వ్యాసరచన, చిత్రలేఖనం, బొమ్మలకు రంగులు వేయడం, భగవద్గీత శ్లోక పఠనం, శ్రీ కృష్ణ గానం మొదలైన విషయాలలో పోటీలు నిర్వహించారు. పాల్గొన్న వారందరికీ ప్రసాదాలు, ప్రమాణ పత్రాలు సమర్పించారు అందించారు. ఈ పోటీలు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. తమ పిల్లలు సనాతన ధర్మం గురించి తెలుసుకునేలా ప్రోత్సహించినందుకు తల్లిదండ్రులను అభినందించారు.

తిరుపతి

సూర్య ప్రభ వాహనంపై దర్శనమిచ్చిన నీలకంఠేశ్వర స్వామి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధం దేవాలయమైన ఊరందూరు గ్రామంలో వెలసియున్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మంగళవారం రెండవ తిరునాళ్ళు నిర్వహించడం జరిగింది.ముందుగా స్వామి అమ్మవార్లను పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం సూర్య ప్రభ వాహనంపై శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు.

భక్తి

ప్రవచనాల కు అనుమతి లేదా పరమేశా!అంజూరు తారక శ్రీనివాసులు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కైలాస క్షేత్రంలో నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలతో ధార్మిక ప్రసంగాలతో ముక్తి మార్గాన్ని సూచించాల్సిన చోట ఆధ్యాత్మిక ప్రవచనాలకు శ్రీకాళహస్తి దేవస్థానం అనుమతులు ఇవ్వకపోవడం అత్యంత శోచనీయమని  దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. తాము పాలకమండలి ఛైర్మెన్ గా వున్నప్పుడు శుక బ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి విద్యా స్వరూపానంద స్వామూల వారి ప్రవచనాలు ఏర్పాటు చేశామన్నారు.ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ ప్రవచనాలను అనుమతి ఇచ్చి ప్రజలలో ఆధ్యాత్మికత పెరిగేలా చేయాలన్నారు.

E-పేపర్

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే టీ తాగుదాం చర్చించుకుందాం – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ గారు నూతనంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 5వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నంద్యాల జిల్లా చిన్న నీటి పారుదల శాఖ కార్యాలయం ఆవరణంలో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఉద్యోగుల బకాయిలు పరిష్కరించాలని సమస్యల తోరణం తో ధర్నాలకు వెళితే ఉద్యోగులను దేశద్రోహుల భావించి మన రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్యనారాయణ గారిని అరెస్టు చేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయని ప్రభుత్వాలు మనకెందుకని మనం నూతనంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైబడిన ఇంకా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తున్నది అన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు 35 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉందని ఈ మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో అర్థం కావడం లేదన్నారు. అందుకని జిల్లా కేంద్రాలు, పరిసర మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి వారికి ఇవ్వాల్సిన బకాయిలను జమ చేసుకోవడం వలన ఇటు ఇల్లు నిర్మించుకోవాలన్న ఉద్యోగుల కల అటు ప్రభుత్వ బకాయిలు రెండు నెరవేరుతుందని రాష్ట్ర అధ్యక్షులు అభిప్రాయమని నాగేంద్రప్ప పేర్కొన్నారు. దీంతోపాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమే అన్నారు. రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమంలో కూడా ఏదైనా ఉద్యోగ సమస్యలు ఉంటే తమ సంఘం దృష్టికి తీసుకువస్తే సత్వరం జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారం కి కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకంతో తాము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతోనే సానుకూలంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమం ద్వారా ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నామని ఆయన అన్నారు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని వారు వారి పిల్లలకు వివాహాధి కార్యక్రమాలు చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాలను ప్రభుత్వం గుర్తించి సత్వరం ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు మార్గాన్ని ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వానికి విన్నవించారు. కార్యక్రమం అనంతరం రాష్ట్ర అధ్యక్షుకు శ్రీ కె ఆర్ సూర్యనారాయణ గారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, కార్యదర్శి తిరుపాల్, ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ విజయలక్ష్మి సునీల్ కుమార్, ఎన్.యం. ఆర్. మినిమం టైమ్ స్కేల్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ మరియు నాయకులు వేణుగోపాల్ రెడ్డి, కార్య వర్గ సభ్యులు దావూద్ ఖాన్, బుల్లెట్ భాష, రఫీ, ఆళ్లగడ్డ వ్యవసాయ శాఖ ADA విజయశేఖర్ ఉద్యోగులు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయండి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు(పున్నమి ప్రతినిధి) ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కరట్లపల్లి.భవాని శంకర్ భువనగిరి జిల్లా కేంద్రంలోని బిసి కళాశాల హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో వారు కరపత్రం ఆవిష్కరించి. ఆగస్టు 11,12,13వ తేదీల్లో భువనగిరిలో జరిగే ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ చదువుతు పోరాడు, చదువుపై పోరాడు నినాదంతో ముందుకెళ్తుందన్నారు. విద్యార్థుల సమస్యలపై నికరంగా పోరాడుతున్న సంఘం ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న అతిపెద్ద సంఘమన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకొచ్చిన బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణం చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నూతన విద్యా విధానం వల్ల విద్యను పూర్తిగా ప్రయివేటీకరణ చేయడం జరుగుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకొచ్చి 24 నెలలవుతున్నా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజురీయీంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శిక్షనా తరగతులకు 300 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారన్నారు. 11వ తేదీన భువనగిరి ర్యాలీ ఉంటుందన్నారు. 12,13వ తేదీల్లో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. తరగతులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమం రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హాస్టల్ కమిటీ కార్యదర్శి గోల్కొండ సతీష్, కమిటీ నాయకులు అరవింద, అభిషేక్,అభినవ్, శివ, మచ్చగిరి మరియు విద్యార్థులు పాల్గొన్నారు

తిరుపతి

ఘనంగా గ్రామ దేవత శ్రీ గొల్లపల్లెమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం ఉదయమాణిక్యం గ్రామపంచాయతీ పుట్టావాండ్లపల్లి సమీపంలో ఉన్న గ్రామ దేవత అయిన శ్రీ గొల్లపల్లెమ్మ అమ్మవారి తిరునాళ్లు గత మూడు రోజులుగా ఘనంగా జరిగినాయి ఉదయ మాణిక్యం గ్రామానికి చెందిన కోరవాండ్లపల్లి పుట్టవాండ్లపల్లి కాల్వకాడ తొప్పి రెడ్డి గారి పల్లి మర్రిపాటి వారి పల్లి గ్రామస్తులు సంయుక్తంగా కలిసి మూడు రోజుల ఈ జాతరను ఘనంగా నిర్వహించినారు ఈరోజు చివరి రోజు అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకొని ఘనంగా పూజ చేసి భక్తులు వారి మొక్కులు తీర్చుకొని ఘనంగా జాతరను ముగించారు

తిరుపతి

ఘనంగా గ్రామ దేవత శ్రీ గొల్లపల్లెమ్మ ఉత్సవాలు

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం ఉదయమాణిక్యం గ్రామపంచాయతీ పుట్టావాండ్లపల్లి సమీపంలో ఉన్న గ్రామ దేవత అయిన శ్రీ గొల్లపల్లెమ్మ అమ్మవారి తిరునాళ్లు గత మూడు రోజులుగా ఘనంగా జరిగినాయి ఉదయ మాణిక్యం గ్రామానికి చెందిన కోరవాండ్లపల్లి పుట్టవాండ్లపల్లి కాల్వకాడ తొప్పి రెడ్డి గారి పల్లి మర్రిపాటి వారి పల్లి గ్రామస్తులు సంయుక్తంగా కలిసి మూడు రోజుల ఈ జాతరను ఘనంగా నిర్వహించినారు ఈరోజు చివరి రోజు అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకొని ఘనంగా పూజ చేసి భక్తులు వారి మొక్కులు తీర్చుకొని ఘనంగా జాతరను ముగించారు

హనుమకొండ

పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి సహకారంతో మన వార్డును అభివృద్ధి చేసుకుందాం*

* *ఈరోజు పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారం 7వ వార్డులో బుర్ర సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు ఇన్చార్జి దుబాసి వెంకటస్వామి గారు పాల్గొని వారు మాట్లాడుతూ మన శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారితోనే వార్డును అభివృద్ధి చేసుకుందాం ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి AMC చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి గారు సమన్వయ కమిటీ సభ్యులు నల్లెల్ల అనిల్ కుమార్, సీనియర్ నాయకులు వెల్దండి విజయ్ భాస్కర్, మార్కెట్ డైరెక్టర్ నల్లెల్ల కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉడుత సంపత్, మార్క రజనీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు. పులి రాజు, గోపు సంజీవ్, గోపు కొమురయ్య. పంచగిరి భాస్కర్. రాగుల నాగరాజు. వార్డు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*

ఖమ్మం

గ్రామీణ వికాసం బిజెపి తోనే సాధ్యం

సత్తుపల్లి (ఖమ్మం పున్నమి ప్రతినిధి) ఆగష్టు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో బేతుపల్లి లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ ప్రచారం చేపట్టాలని ఇచ్చిన పిలుపుమేరకు బీజేపీ మాజీ మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ అధ్యక్షులు పాలకొల్లు రోజా రాణి, పాకనాటి హరిబాబు, మునుగొండ స్రవంతి “ఘర్ ఘర్ బీజేపీ” కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభలు శ్రీమతి కరణం పరిణిత తో కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వర రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుబిజెపి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కన్వీనర్ శ్రీ e.v రమేష్ ఒక్కదాని పుల్లారావు యాదవ్, బిజెపి జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి బిజెపి కార్యకర్త వెళ్లి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపడుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు వివరించి కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రతి ఇంటికి తెలియచేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు.. ➡️ మోదీ పాలనలో దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ➡️ ప్రతి బూత్ అధ్యక్షుడు కనీసం 100 ఇండ్లను సందర్శించి మోదీ సందేశం చెప్పాలన్నారు. ➡️ ఇది కేవలం ప్రచారం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్యమమని తెలిపారు. ➡️ గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిలో మునిగిపోయాయని విమర్శించారు. ➡️ బీసీలకు న్యాయం చేయాలని, 42% రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ➡️ మోదీ నాయకత్వంలో అభివృద్ధి, గ్రామీణ సంక్షేమం జరుగుతోందని వివరించారు. ➡️ రేషన్, రోడ్లు, మొక్కలు నాటడం, పీఎం కిసాన్ నిధులు వంటి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. “ప్రతి ఇంటికీ బీజేపీ సందేశం – ప్రతి గ్రామానికి అభివృద్ధి” ఈ కార్యక్రమంలో మంద శివ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆచంట నాగ స్వామి, మాజీ కౌన్సిల్ సభ్యులు మట్ట ప్రసాద్, శివ, సాయి, బండి ఆంజనేయులు, ప్రసాద్, వేంసూర్ మాజీ మండల అధ్యక్షులు పరసా రాంబాబు,పట్టణ అధ్యక్షులు బానోతు విజయ్,తల్లాడ మండల అధ్యక్షులు నాగులు, ఉబ్బల కృష్ణ, పాల నాగ సురేంద్ర రెడ్డి, వేంసూర్ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మెరుగు శేషగిరిరావు, కార్తీక్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, వెంకట రెడ్డి, శ్రీనివాస్, అశోక్, ఈడ గణేష్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.