భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు బుడగం రవిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా సోషల్ మీడియా లేదా ఇతర వేదికల్లో వ్యవహరించే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నాయకత్వం హెచ్చరించింది. రాబోయే రోజుల్లో జిల్లాలో బీజేపీ విజయానికి కార్యకర్తలందరూ క్రమశిక్షణతో, పరస్పర సద్భావనతో పనిచేయాలని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ విజయ చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశాలు, నియమ నిబంధనలను ప్రతి కార్యకర్త తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.



