భక్తులు గుడి గడపకు ముందుగా ఎందుకు నమస్కరిస్తారు

0
225

సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద గర్భగుడిలోకి వెళ్లే ముందు ఉండే గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు.
వాస్తవానికి ఇళ్లకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది.
ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు. ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అని శీశీశ్రీ అమరేంద్ర స్వామి వారిని అడుగగా.. ఈ క్రింది విధంగా సెలవిచ్చారు.
రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతం గానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయము గానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రి గానూ అవతరించారు. ఆ భక్తుల కోసం, వారి కోరిక ప్రకారం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ పర్వత రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి. ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా అది ఎంతో పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని వేడుకుంటూ గడపకు నమస్కరిస్తారని వేద పండితులు చెబుతారు. అందుకే ఆలయంలోని ప్రధాన గడప తొక్కకూడదని… కేవలం కుడి కాలు ముందు పెట్టి దాటాలని పెద్దలు సూచిస్తున్నారు.

0
0