రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : స్నేహహస్తం హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా సందర్భంగా జరుగుతున్న 47 వ అన్నదానానికి Sd.ఆసిఫ్, జిల్లా వోక్ఫ్ బోర్డు డైరెక్టర్ (వైయస్ అర్ సిపి) నాయకులు 500 మంది పేద గిరిజనులకు అన్నదానం కి విరాళం స్నేహ హస్తం ఫౌండేషన్ వారికి ఇవ్వడం జరిగింది వారి సహాయ సహకారాలతో పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగింది. Sd.ఆసిఫ్ గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తు ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.