
పున్నమి
దేశంలో లాక్ డౌన్ మే 3వ తేదీతో ముగియనుండగా,తజాగా లాక్ డౌన్ ను కేంద్రం మరోసారి పొడిగించింది.రెండు వారాలా పాటు (మే 17 వరకు) లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది.దేశంలో లాక్ డౌన్ పొడిగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.దేశంలో కరోనా కేసులు పేరుగుతుండటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

