వ్యవసాయ మార్కెట్ కార్యాలయం లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
———————————————————————–
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప రోజు.
*తెలంగాణ విలీన మరియు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జనగామ రైతులకు మరియు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు*.
ఈరోజు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు .
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుకు శివరాజ్ యాదవ్*
ఈ సందర్భంగా *శివరాజ్ యాదవ్* మాట్లాడుతూ
1948లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడంతో ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైంది అని తెలిపారు. అదేవిధంగా
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడిన రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజలు, అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తునాము. అని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుక శివరాజ్ యాదవ్* అన్నారు.
అదేవిధంగా ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజా పాలన ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమం లో వ్యాపారులు చేరివిరాల ఉపేందర్, కృష్ణ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు సాదం మధుసూదన్,మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బనుక ప్రభాకర్,హమాలీ సంఘం నాయకులు రాజు,వీర స్వామి ,సిద్ధులు,రమేష్, కుమార్,AMC సిబ్బంది బాబు రావు, ఎల్లయ్యా,కృష్ణ, శారద,కుమారస్వామి, ప్రవీణ్, ఉమా మహేశ్వరి, కోమలత, నిరోష,క్రాంతి, సాయి ,మహిళలు, మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.


