కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు కాకినాడ మూడో బెటాలియన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న శిక్షణార్థుల సౌకర్యార్థం 30 నూతన కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. శిక్షణార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుని, శిక్షణ సమయంలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ శ్రీ కె. నవీన్ కుమార్, అడిషనల్ కమాండెంట్ శ్రీ ఎస్. దేవానంద్ రావు, అసిస్టెంట్ కమాండెంట్లు శ్రీ డి. గంగరాజు, శ్రీ బి. చంద్రశేఖర రావు, శ్రీ ఎస్. మన్మధ రావు, ఆర్.ఐలు శ్రీ రవిశంకర్, శ్రీ శివరామకృష్ణ, శ్రీ కె. శ్రీనివాస్, శ్రీ డి. రాజు, శ్రీ హరిబాబు, ఇతర అధికారులు, సిబ్బంది, శిక్షణ పొందుతున్న శిక్షణార్థులు పాల్గొన్నారు.




