టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల ప్రయాణం సంతృప్తికరంగా సాగిందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవని, అభిప్రాయ భేదాలు వచ్చినా వెంటనే పరిష్కరించుకున్నామని చెప్పారు. పార్టీని బూత్ స్థాయి వరకు బలోపేతం చేశామని పేర్కొన్నారు. కుల సర్వే ద్వారా తెలంగాణలో సామాజిక న్యాయం జరిగిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ లేకపోతే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు గెలిచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ నెలాఖరులోపు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ల ఎంపికలో డీసీసీ అధ్యక్షుల అభిప్రాయానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.

రేవంత్తో విభేదాలు లేవు: మహేష్ కుమార్ గౌడ్
టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల ప్రయాణం సంతృప్తికరంగా సాగిందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవని, అభిప్రాయ భేదాలు వచ్చినా వెంటనే పరిష్కరించుకున్నామని చెప్పారు. పార్టీని బూత్ స్థాయి వరకు బలోపేతం చేశామని పేర్కొన్నారు. కుల సర్వే ద్వారా తెలంగాణలో సామాజిక న్యాయం జరిగిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ లేకపోతే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు గెలిచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ నెలాఖరులోపు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ల ఎంపికలో డీసీసీ అధ్యక్షుల అభిప్రాయానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.

