*పున్నమి న్యూస్, దొరవారిసత్రం మండలం, పూలతోట గ్రామo:*
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పూలతోట గ్రామం లో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి.
పూలతోట యూత్ సభ్యులు *నవీన్, వంశీ, గణేష్, కిరణ్, చరణ్, సుధీర్, సూరి, భార్గవ్, నిఖిల్, సన్నీ* ల ఆధ్వర్యంలో శివశక్తి అవతారంలో ఉన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి భారీ పూలమాలలతో అలంకరించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. యువకులంతా కలిసి ఐక్యమత్యంతో వేడుకలను విజయవంతం చేశారు. గ్రామంలో భక్తిమయ వాతావరణం నెలకొంది.
వినాయకుడి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని యూత్ సభ్యులు ఆకాంక్షించారు.
*ఇట్లు,*
*పూలతోట యూత్,*


