తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి) రాజమండ్రి. చెన్నై నుంచి గన్నవరం వెళ్తున్న ఇండిగో విమానంలో విమానం పరం, ప్రతికూల వాతావరణం కారణంగా రాజమండ్రి ఎయిర్పోర్టులో సేఫ్ ల్యాండింగ్ అయింది. విమానంలో మొత్తం 65 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అనంతరం వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఆ విమానం రాజమండ్రి నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.
వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన రాకపోకలపై ప్రభావం పడినప్పటికీ, ఎయిర్పోర్టు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు చేపట్టారు.


