ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. రాజీకి అవకాశం ఉన్న మొత్తం 10,995 కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు వెల్లడించారు. వీటిలో 985 ఎఫ్ఐఆర్ కేసులు, 3,301 ఈ-పెట్టి కేసులు, 6,621 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 48 సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకోవడంతో పాటు బాధితులకు న్యాయం అందేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పరిష్కరించిన కేసుల్లో బాధితులకు మొత్తం రూ.27,90,612 నగదు రిఫండ్ చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. ప్రజలు రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.



