అనంతగిరి మండలం, కొత్తూరు పంచాయతీ పరిధిలో అర్హులైన గిరిజనులు ఎన్టీఆర్ భరోసా నూతన పెన్షన్లకు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని సచివాలయ డిఏ కె. ప్రేమ్ కుమార్ శుక్రవారం కోరారు. ఆధార్, కులధ్రువీకరణ, విద్యుత్ బిల్లు, ఆధార్ కు అనుసంధాన ఫోన్ నంబర్ తో సచివాలయానికి రావాలన్నారు. వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ, వికలాంగులు సదరం సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపారు. మహిళలకు 50 సంవత్సరాలు నిండిన వారు అర్హులన్నారు.

అనంతగిరి: ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానం
అనంతగిరి మండలం, కొత్తూరు పంచాయతీ పరిధిలో అర్హులైన గిరిజనులు ఎన్టీఆర్ భరోసా నూతన పెన్షన్లకు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని సచివాలయ డిఏ కె. ప్రేమ్ కుమార్ శుక్రవారం కోరారు. ఆధార్, కులధ్రువీకరణ, విద్యుత్ బిల్లు, ఆధార్ కు అనుసంధాన ఫోన్ నంబర్ తో సచివాలయానికి రావాలన్నారు. వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ, వికలాంగులు సదరం సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపారు. మహిళలకు 50 సంవత్సరాలు నిండిన వారు అర్హులన్నారు.

