*ప్రతి క్షణం – ప్రజల కోసం*పున్నమి న్యూస్
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి గురువారం నాయుడుపేట కోర్టులో లొంగిపోయారు.
ఒక వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి ఆయనపై సెక్షన్ 302 కింద కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కేసులో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని కోర్టులో హాజరుపరచగా, కేసును విచారించిన నాయుడుపేట కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, పోలీసుల భద్రత మధ్య రిమాండ్కు తరలించినట్లు సమాచారం.


