భూపాలపల్లి:- ఈనెల 09-09-2026 బుధవారం రోజున అంబేద్కర్ స్టేడియంలో *భూపాలపల్లి జిల్లా కబడ్డీ అసోసియేషన్* ఆధ్వర్యం లో నిర్వహించిన కబడ్డీ జూనియర్ బాలికల విభాగం లో
గోనె సాయి మనస్విని(10వ తరగతి), సబ్ జూనియర్ బాలికల విభాగం లో గుగులోత్ వైష్ణవి(10వ తరగతి) మరియు బాలుర విభాగం లో బానోత్ సుశాంత్ (9వతరగతి) ఎంపిక కావడం జరిగింది.ఇట్టి పోటీలలో ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 26-09-2026 నుంచి 29-09-2026 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా లోని వేములవాడలో నిర్వహించబోయే 36 సబ్ జూనియర్ & 52వ జూనియర్ బాలుర & బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలల లో పాల్గొనడం జరుగుతుందని స్థానిక ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ డాక్టర్ ఏ.రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ రజినీకాంత్ గారు మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు. అలాగే ప్రిన్సిపాల్ రజనీకాంత్ గారు మాట్లాడుతూ వీరిని ప్రోత్సహించిన గౌరవ తల్లిదండ్రులకు మరియు వ్యాయామ ఉపాధ్యాయుడైన సాంబరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు
భూపాలపల్లి:- ఈనెల 09-09-2026 బుధవారం రోజున అంబేద్కర్ స్టేడియంలో *భూపాలపల్లి జిల్లా కబడ్డీ అసోసియేషన్* ఆధ్వర్యం లో నిర్వహించిన కబడ్డీ జూనియర్ బాలికల విభాగం లో గోనె సాయి మనస్విని(10వ తరగతి), సబ్ జూనియర్ బాలికల విభాగం లో గుగులోత్ వైష్ణవి(10వ తరగతి) మరియు బాలుర విభాగం లో బానోత్ సుశాంత్ (9వతరగతి) ఎంపిక కావడం జరిగింది.ఇట్టి పోటీలలో ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 26-09-2026 నుంచి 29-09-2026 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా లోని వేములవాడలో నిర్వహించబోయే 36 సబ్ జూనియర్ & 52వ జూనియర్ బాలుర & బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలల లో పాల్గొనడం జరుగుతుందని స్థానిక ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ డాక్టర్ ఏ.రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ రజినీకాంత్ గారు మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు. అలాగే ప్రిన్సిపాల్ రజనీకాంత్ గారు మాట్లాడుతూ వీరిని ప్రోత్సహించిన గౌరవ తల్లిదండ్రులకు మరియు వ్యాయామ ఉపాధ్యాయుడైన సాంబరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.

