పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 9 .డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్,జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి, జిల్లా.అధికారులు,ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలంలో
ముఖ్యమంత్రి మాచవరం గ్రామానికి చేరుకుని హెలిప్యాడ్ వద్ద రైతులతో ముఖాముఖి మాట్లాడారు.ఈ సందర్భంగా రైతులు 22A భూ సమస్యలను, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, వ్యవసాయం వ్యవసాయం,సాగునీరు, త్రాగునీరు వంటి అంశాలపై
రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా,వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు సక్రమంగా పనిచేసిన అధికారులను ప్రశంసిస్తూ సక్రమంగా పనిచేయని అధికారులను తీవ్రంగా హెచ్చరించి పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని గాటైన వ్యాఖ్యలతో హెచ్చరించారు ప్రజలకు జవాబుదారిగా నేను ఉంటానని నాకు మీరు జవాబుదారీగా ఉండే ప్రజలకు చేయాలని ప్రతి అధికారిని వారి యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు మైనింగ్ (ఇసుక) అధికారిన పనితీరు అసలే బాలేదని తీవ్ర నిరాష ఆవేదన తెలియజేసి ఘాటైన వ్యాఖ్యలతో పనితీరు మార్చుకోవాలని ప్రజలకు అందుబాటులో ఇసుక ఉండేటట్లు చూడాలని గట్టిగా హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్, ఏపీ ఎఫ్డీసీఎల్ చైర్మన్ శ్రీ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, రాజ్యసభ ఎంపీ సనా సతీష్, కార్మిక, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ,ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు పాల్గొని పూల బుకేలు, సాలువల కప్పి ఘన స్వాగతం పలికారు.


