కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని పోలేరమ్మ గుడి సమీపంలో నిర్మించనున్న వడ్డెర కుల అన్నదాన సత్రం నిర్మాణానికి సోమవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రమణ,మాజీ ఎంపీపీ చక్రవర్తి, అచలానంద ఆశ్రమ పిఠాధిపతి శ్రీ విరజానంద స్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి సోదరుడు శ్రీ దత్తాత్రేయ స్వామి , ఎంపీపీ వీరనారాయణరెడ్డి , మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి, పూజ శివయ్య , ఎస్.ఆర్.శ్రీనివాసులరెడ్డి, ముడుమాల పోల్ రెడ్డి, మల్లె బాలకృష్ణ , టిడిపి మండల ఉపాధ్యక్షులు శీలం నరసింహ గౌడ్, వడ్డెర రాజుల బంధువులు సోదరులు పాల్గొని కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రహ్మంగారిమఠానికి వచ్చే వడ్డెర కుల బంధువులకు,భక్తులకు అన్నదాన సత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.సత్ర నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం పెద్దలు,కుల బంధువులు,గ్రామస్తులు పాల్గొన్నారు.


