జనగామ పట్టణం లోని మహంకాళి ఆలయం పురాతన మైనది
—————————————————————
జనగామ, సెప్టెంబర్ 7,పున్నమి జిల్లా ప్రతినిధి :
జైన సాంప్రదాయంతో సంబంధాలు కలగిన జనగామ పట్టణంలో ఉన్న మహంకాళి ఆలయం ఎంతో పురాతనమైనదని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పాముకుంట్ల కుమార్,అధ్యక్షులు రంగు వీరస్వామి తెలిపారు.1970 దశకం వరకు ఇట్టి దేవాలయం తో పాటు, గణపతి దేవాలయం మరియు గ్రామ దేవతలైన పోచమ్మ, మాతమ్మ దేవాలయాలు ఊరు పొలిమేరగా ఉండేవి. క్రమేణా ఊరు పెరగడం వలన ఈ ఆలయాలు ఇప్పడు నగరం నడిబొడ్డున వున్నాయి. జైన సంప్రదాయానికి అనవాలుగా మహావీరుని శిల్పం మనకు మహంకాళి మాతా ఆలయంలో దర్శనము ఇస్తుంది.ఇంతటి పురాతనమైన ఈ మహంకాళి ఆలయమును 2017 సం. లో పునఃరనిర్మాణం చేయడం జరిగింది. శక్తి స్వరూపిని అయినా మహంకాళి అమ్మవారు భక్తులను చల్లగా చూస్తుందని నిండుమనసుతో భక్తితో అమ్మ వారిని కొలిచే భక్తులకు ఎల్లవేళలా అండగా నిలుస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి అమావాస్య రోజు దేవాలయంలో అన్నవితరణ కార్యక్రమము. ఆశాడ శ్రావణ మాసాలాలో విశేష పూజలు, హోమాలు వివిధ రూపాలలో అమ్మవారికి అలంకరణలు , మరియు బోనాల జాతరలు నిర్వహించబడును.
ఈ కార్యక్రమాలన్నిటిని ఆలయకమిటి ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తుంది. ఆలయ కమిటీలో
గౌరవాధ్యక్షులు పాముకుంట్ల ప్రసాద్ కుమార్, అధ్యక్షులు రంగు వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి రంగు లక్ష్మణ్, కోశాధికారి పాముకుంట్ల మధుసూదన్ ఉపాధ్యక్షులు కసాబు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.అనేక సంవత్సరాలనుండి శ్రావణమాసంలో అలంకరణ చేసి భక్తి శ్రద్ధ లతో పూజలు నిర్వహిస్తారని భక్తులు అనేక మంది వారి మొక్కులు చెల్లించి దర్శనం చేసుకుంటారని ఆలయ కమిటీ వారు తెలిపారు



