గురువుల సేవలకు ఘన సన్మానం
దొరవారిసత్రం, సెప్టెంబర్ 5:
దొరవారిసత్రం మండలంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ, విద్యా రంగంలో అంకితభావంతో సేవలందిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది, అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యాభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల స్థాయి బెస్ట్ టీచర్స్ అవార్డులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఎంపికై, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కారం అందుకున్నారు. అవార్డు అందుకున్న ఉపాధ్యాయులకు సహచర ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది అభినందనలు తెలిపారు.
అవార్డు అందుకున్న ఉపాధ్యాయులు:
కె.ఎస్. సురేంద్రబాబు – SGT, MPPS యెకొల్లు
పీ. రవికుమార్ – SGT, MPPS నెల్లూరుపల్లి
కె.సి. చెంగయ్య – SGT, MPPS వెణుంబాక G.C.
ఎస్.కె. హుస్సేన్ బాషా – SGT, MPPS కల్లూరు
ఏ. మైతిలి – SGT, MTS MPPS శ్రీధనమల్లి
ఆర్. శ్రీనివాసులు – CRMT, ZPHS యెకొల్లు కాంప్లెక్స్
జె. సురేఖ – MIS-CO, MRC దొరవారిసత్రం మండలం
కె. అరుణకుమారి – PSHM, MPPS పోలిరెడ్డిపాలెం దొరవారిసత్రం మండలం
విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా..
ఉపాధ్యాయ వృత్తి కేవలం పాఠాలు బోధించడానికే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించే గొప్ప బాధ్యత అని కార్యక్రమంలో పలువురు పేర్కొన్నారు. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా కొత్త బోధనా పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని కొనియాడారు.
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సన్మానించడం ద్వారా వారి సేవలకు గుర్తింపు లభించడమే కాకుండా, ఇతర ఉపాధ్యాయులకు కూడా మరింత స్ఫూర్తి లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు.
ఆకట్టుకున్న సన్మాన కార్యక్రమం
కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు పూలమాలలు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానం నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి గ్రూప్ ఫొటోలు దిగారు. కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది.
“విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే ప్రతి గురువు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి సేవలను గుర్తించి సత్కరించడం అభినందనీయం” అని పలువురు పేర్కొన్నారు.


