*గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడి గారిని కలిసిన తిరువూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు..* పున్నమి న్యూస్ ప్రతి నిథి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు
_ఉండవల్లి,_
_ది.05-09-2026._
*_ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహించిన SC & ST (POA) Act, 1989 మరియు Rules, 1995 అమలు తీరుపై రాష్ట్రస్థాయి హై పవర్ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశంలో తిరువూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు._*
_ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, వివక్షను అరికట్టడం, బాధితులకు సత్వర న్యాయం అందించడం, వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు చట్టపరమైన రక్షణలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు._
_అనంతరం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు._
_గత రెండు సంవత్సరాలుగా తిరువూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా దాదాపు రూ.15 కోట్ల నిధులు కేటాయించి, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు._
_అదేవిధంగా ఏ.కొండూరు మండలంలో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కృష్ణా జలాల పథకం పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకం అందుబాటులోకి వస్తే ఏ.కొండూరు మండల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందడంతో పాటు కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడుతుందని వివరించారు._
_తిరువూరు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన కట్టలేరు వంతెన నిర్మాణం అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. వంతెన నిర్మాణానికి పరిపాలనా అనుమతులు లభించి నెలలు గడుస్తున్న నేపథ్యంలో, ఆర్థిక శాఖ అనుమతులు త్వరితగతిన మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరారు._
_అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా తిరువూరులో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “జయహో బీసీ” భారీ కార్యక్రమం వివరాలను ముఖ్యమంత్రి గారికి వివరించారు. బీసీల రాజకీయ, సామాజిక సాధికారత కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తిరువూరు నియోజకవర్గ ప్రజలు తెలిపిన మద్దతు, కార్యక్రమానికి వచ్చిన విశేష స్పందనను తెలియజేశారు. ఈ సందర్భంగా జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారిని అభినందించారు._
_సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ…_
_తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్తూ…_
_ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు._
*
*తిరువూరు అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారం…*
*ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి నిరంతర కృషి!*
Srinivasa Rao Kolikapudi
Kolikapudi Srinivasa Rao MLA



