బిహార్లోని భాగల్పూర్ జిల్లాలో గంగానదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగలో ఓ పడవ ఒక్కసారిగా బోల్తా పడి మునిగిపోయింది. పడవలో ఉన్న 21 మంది కూలీలు నీటిలో పడిపోయారు. సమాచారం అందుకున్న SDRF సిబ్బంది వేగంగా సహాయక చర్యలు చేపట్టి 20 మందిని సురక్షితంగా రక్షించారు. మరో కార్మికుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. వరద నివారణ చర్యల్లో భాగంగానే కూలీలు నదిలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పడవ మునిగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Uploaded Video:

