స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నరహరి నరసింహాచార్యులు తెలిపారు. ఈ నెల 16న సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 17న 108 కలశాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. 18న స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. 19న పూర్ణాహుతి, శాంతి కల్యాణం నిర్వహించి పవిత్రోత్సవాలను ముగించనున్నట్లు అర్చకులు తెలిపారు.



