Sunday, 16 August 2026
  • Home  
  • అల్లాపూర్, గాయత్రి నగర్ డివిజన్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- మేడ్చల్ – మల్కాజిగిరి

అల్లాపూర్, గాయత్రి నగర్ డివిజన్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అల్లాపూర్, గాయత్రి నగర్ డివిజన్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అల్లాపూర్ డివిజన్ బీజేపీ నాయకులు సందీప్ నాయక్, గాయత్రి నగర్ డివిజన్ బీజేపీ నాయకులు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు  వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ డివిజన్లలోని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అల్లాపూర్, గాయత్రి నగర్ డివిజన్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అల్లాపూర్ డివిజన్ బీజేపీ నాయకులు సందీప్ నాయక్, గాయత్రి నగర్ డివిజన్ బీజేపీ నాయకులు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు  వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ డివిజన్లలోని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.