ఖాజీపేట మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఖాజీపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) యస్.కె. మస్తాన్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల సంక్షేమం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో బాధ్యతలను నిర్వర్తించాలని MPDO యస్.కె. మస్తాన్ సూచించారు.
కార్యక్రమంలో APO, APMతో పాటు మండల ప్రజా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అధికారులు, సిబ్బంది పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.



