*వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం – రాయలసీమ భాగస్వామ్యం (ప్రత్యేక సంచిక)*
*ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి రచించిన దర్శనం(నాటిక వ్యాసాలు)*
*గ్రంధాల ఆవిష్కరణ…రెడ్యం కు ఆహ్వానం.*
*వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం – రాయలసీమ భాగస్వామ్యం (ప్రత్యేక సంచిక),ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి రచించిన దర్శనం(నాటక వ్యాసాలు) గ్రంధాల ఆవిష్కరణ 2026 ఆగష్టు 23వ తేది ఆదివారం ఉదయం 10:00 గంటలకు కడప నగరంలోని సి.పి.బ్రౌన్ బాషా పరిశోదన కేంద్రంలో వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది.*
*ఈ కార్యక్రమానికి మీరు తప్పక హాజరు కావాలని వైయస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి బుధవారం ఉదయం ఖాజీపేట మండలం, దుంపలగట్టు లోని వారి స్వగృహం లో వైఎస్సార్ కడప జిల్లా రచయుతల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి,సాహిత్య విమర్శకులు డా|| జి.వి. సాయిప్రసాద్, సాహిత్య పరిశోదకులు డా|| కొప్పోలు రెడ్డిశేఖర్ రెడ్డి, మధుర కవి డా|| వెల్లాల వెంకటేశ్వర చారి, రాయలసీమ సాహిత్య పరిశోదకుడు డా॥ తవ్వా వెంకట సుబ్బయ్య లు ఆహ్వానం పలికారు. మీరందరూ రావడం మాకు సంతోషంగా ఉందని రెడ్యం వారిని ఆహ్వానించి… గ్రంధాల ఆవిష్కరణ కు తప్పక వస్తానని రెడ్యం వినమ్రంగా వారికి తెలిపారు.రెడ్యం ను వారందరూ ఘనంగా సన్మానించారు.*


