*నందలూరు చెయ్యరు నందు ఏర్పాటు చేస్తున్న జాతీయ రహదారి పనులలో జరుగుతున్న లోపాలు పరిశీలించిన నందలూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు*
కొత్తగా ఏర్పాటు చేస్తున్న కడప టు రేణిగుంట జాతీయ రహదారి పనులలో జరుగుతున్న లోపాలను పరిశీలించిన నందలూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సిద్దవరం గోపి రెడ్డి గారు. అక్కడ జరుగుతున్న పనులు జగతి కట్టకు సుమారు 200 మీటర్లు వదిలేసి బ్రిడ్జ్ నియమించడాన్ని వారు తప్పు పట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బస్సు బ్రిడ్జ్ కావచ్చు, రైలు బ్రిడ్జ్ కావచ్చు అవన్నీ కూడ జగతి కట్ట నుంచి బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న కడప టు రేణిగుంట జాతీయ రహదారి పనులు బ్రిడ్జ్ జగతికట్ట నుంచి 200 మీటర్ల దూరంలో బ్రిడ్జిని నియమించడం జరుగుతుంది ఇదేమని అక్కడివారిని ప్రశ్నించగా వారు ఇచ్చిన సమాధానం ఈ రెండు వందల మీటర్లు మట్టితోలి రోడ్డును నియమించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలా చేయడం వలన పెద్ద పెద్ద వర్షాభావాల కారణంగా చేయి ఎరుకు నీరు వచ్చినప్పుడు ఆ రోడ్డు అనేది కొట్టుకోపోవడం జరుగుతుంది అలా కొట్టుకుపోవడం వలన బ్రిడ్జి కూడా కూలే ప్రమాదం ఉంటుంది. కావున సంబంధిత అధికారులు ఈ పనులు పునఃపరిశీలించవలసినదిగా కోరుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బూత్ కన్వీనర్ నడివీధి సుధాకర్, జిల్లా అధికార ప్రతినిధి గుండు మల్లికార్జున్రెడ్డి, వాలంటీర్స్ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు బయనబోయిన భాస్కర్ యాదవ్, మాజీ సర్పంచ్ గంగి నాయుడు, పొత్తపి హర్షవర్ధన్ రెడ్డి, శంకర్, మహబూబ్ బాషా, ఎముక దుర్గయ్య కడప రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:

