(*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*) జూలై 30 ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మండల పరిధిలో వల్లిపేడు గ్రామంలో దృష్టిలోపం ఉన్నవారికి
కంటి అద్దాలు పంపిణీవిద్యార్థుల హోమియో మందులు పంపిణీ లుచిల్లకూరు జులై 30.చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామంలో ఇటీవల నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో వైద్య శిబిరానికి హాజరైన రోగులను పరీక్షించి వారికి కంటి అద్దాలు, ఉచితంగా కంటి ఆపరేషన్లు కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ నిర్వహించారు.
నేత్ర వైద్య శిబిరంలో కంటి వైద్యులు రమేష్ కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న వారిని ఎంపిక చేశారు.వారికి అతి తక్కువ ధరకు కంటి అద్దాలను గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుకర్ చేతుల మీదుగా దృష్టిలో ఉన్న వారికి కంటి అద్దాలను అందజేశారు.
కంటిలో శుక్లాలు ఉన్నవారికి తిరుపతి పట్టణంలోని వాసన్ ఐ కేర్ కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ నిర్వహించి వల్లిపేడు గ్రామానికి తీసుకురావడం జరిగిందిఆపరేషన్ చేయించుకున్న వారికి నెలరోజులకు అవసరమైన మందులు పంపిణీ చేశారుఅనంతరం పులిబిడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఈ సీజన్లో వచ్చే సీజనల్ వ్యాధులతో హోమియో మందులు పంపిణీ చేశారుఈ కార్యక్రమంలో ఎం.వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ప్రధానోపాధ్యాయుడు మధుకర్, జిల్లా పరిషత్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బండి మురళి. ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు



