⛔ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో సైకిల్ ర్యాలీ
⛔గోమతి సెంటర్ నుంచి బీడీ కాలనీ వరకు ప్రచారం
⛔ *ముఖ్యఅతిథిగా పనబాక* *లక్ష్మి, నెలవల* *విజయశ్రీ ఆధ్వర్యంలో* *ఇంటింటికి *టీడీపీ కార్యక్రమం*
*పున్నమి న్యూస్ మద్దాలి వెంకయ్య* *దొరవారిసత్రo**
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఇంటింటికి టీడీపీ” సైకిల్ ర్యాలీ కార్యక్రమం నాయుడుపేట పట్టణంలో19, 20 వార్డులో జరిగింది. గోమతి సెంటర్ నుండి బీడీ కాలనీ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో *తిరుపతి జిల్లా తెలుగు దేశం* *పార్టీ అధ్యక్షురాలు, టీటీడీ బోర్డు* *సభ్యురాలు డాక్టర్ పనబాక* *లక్ష్మి మరియు సూళ్లూరుపేట* *నియోజకవర్గ శాసనసభ్యురాలు* *డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ* *ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల* *సుబ్రహ్మణ్యం ముఖ్య* *అతిథులుగా* పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించే లక్ష్యంతో “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ర్యాలీ మార్గమంతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. స్థానిక ప్రజలు కూడా ర్యాలీకి విశేషంగా స్పందించి నాయకులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



