ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)
ఖమ్మం నగరంలోని వీడియోస్ కాలనీలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
వేకువజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు, ఆరాధన కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 54వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల నరేంద్ర సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని సాయిబాబా దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.



