ఖమ్మం, జూలై 25
(పున్నమి న్యూస్):
పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతుందని, ఈ రోజు శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని పేర్కొన్నారు.
ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని, రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ధర్మం, సంస్కృతి, సనాతన విలువలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు.
ఈ పవిత్ర తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ భక్తి, నియమ నిష్ఠలతో పర్వదినాన్ని జరుపుకోవాలని గల్లా సత్యనారాయణ కోరారు.



