Wednesday, 22 July 2026
  • Home  
  • టీడీపీ సీనియర్ నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన నల్లమిల్లి మనోజ్ రెడ్డి
- తూర్పు గోదావరి

టీడీపీ సీనియర్ నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన నల్లమిల్లి మనోజ్ రెడ్డి

రాజమహేంద్రవరం, జూలై 20 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా నియమితులైన సందర్భంగా యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూలను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని నల్లమిల్లి మనోజ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ భేటీలో నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

రాజమహేంద్రవరం, జూలై 20 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా నియమితులైన సందర్భంగా యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూలను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని నల్లమిల్లి మనోజ్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ భేటీలో నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.