Saturday, 11 July 2026
  • Home  
  • సర్వేపల్లిలో 85 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్వేపల్లిలో 85 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 11 (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఇప్పటివరకు 85 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని ఈఆర్‌ఓ జి. కేశవర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం మనుబోలు ఎంపీడీవో కార్యాలయంలో బీఎల్‌వోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వేను ముమ్మరంగా చేపడుతున్నారని చెప్పారు. మనుబోలు మండలంలో 83 శాతం డిజిటలైజేషన్ పూర్తైందన్నారు. శని, ఆదివారాలను ప్రత్యేక క్యాంపెయిన్ దినాలుగా నిర్వహిస్తూ డబుల్ ఎంట్రీలు, మృతులు, గ్రామంలో నివసించని వారి పేర్లను తొలగించే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఈఆర్‌వోలు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో జలజాక్షి తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 11 (పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఇప్పటివరకు 85 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని ఈఆర్‌ఓ జి. కేశవర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం మనుబోలు ఎంపీడీవో కార్యాలయంలో బీఎల్‌వోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వేను ముమ్మరంగా చేపడుతున్నారని చెప్పారు. మనుబోలు మండలంలో 83 శాతం డిజిటలైజేషన్ పూర్తైందన్నారు. శని, ఆదివారాలను ప్రత్యేక క్యాంపెయిన్ దినాలుగా నిర్వహిస్తూ డబుల్ ఎంట్రీలు, మృతులు, గ్రామంలో నివసించని వారి పేర్లను తొలగించే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఈఆర్‌వోలు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో జలజాక్షి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.