ఆరుగురిని హత్య చేసిన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ ప్రకటన – నిందితుడు రాజ్కుమార్ కోసం ముమ్మర గాలింపు
ఫ్యూచర్ సిటీ | జూలై 11
రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్కుమార్ను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి ఆచూకీ తెలిపి అతడిని పట్టుకోవడంలో సహకరించిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ ప్రకటించారు.
ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితుడి కదలికలపై సమాచారం సేకరిస్తూ, సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ గాలింపు కొనసాగిస్తున్నారు.
రాజ్కుమార్కు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా ఫ్యూచర్ సిటీ పోలీసులకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపగా, నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకొస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.



