Thursday, 9 July 2026
  • Home  
  • రేపు విద్యాసంస్థలు బంద్
- News

రేపు విద్యాసంస్థలు బంద్

రేపు విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలి డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ సంఘాల పిలుపు వాంకిడి, జూలై 9: రాష్ట్రవ్యాప్తంగా జూలై 10న వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వాంకిడి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో విద్యారంగ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంద్‌కు మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కొదురుపాక మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చడం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటిని నియంత్రించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల లేమి, ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం, హాస్టళ్లలో సరైన సౌకర్యాలు లేకపోవడం, విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాల అమలులో జాప్యం వంటి సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా ప్రైవేటీకరణను ప్రోత్సహించడం సరైన విధానం కాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. నాణ్యమైన, ఉచిత విద్యను ప్రతి విద్యార్థికి అందించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని స్పష్టం చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లలో విద్యా హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టడం, నాణ్యమైన ఉచిత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. జూలై 10న నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాస్వామ్యవాదులు స్వచ్ఛందంగా సహకరించి విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ బంద్‌కు సమాజంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి వడ్లూరి శ్రీకాంత్‌తో పాటు ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు, యువజన ప్రతినిధులు పాల్గొన్నారు. Uploaded Video:

రేపు విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలి
డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ సంఘాల పిలుపు
వాంకిడి, జూలై 9: రాష్ట్రవ్యాప్తంగా జూలై 10న వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వాంకిడి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో విద్యారంగ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంద్‌కు మద్దతు కోరారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కొదురుపాక మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చడం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటిని నియంత్రించడంలో విఫలమైందని ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల లేమి, ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం, హాస్టళ్లలో సరైన సౌకర్యాలు లేకపోవడం, విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాల అమలులో జాప్యం వంటి సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా ప్రైవేటీకరణను ప్రోత్సహించడం సరైన విధానం కాదన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. నాణ్యమైన, ఉచిత విద్యను ప్రతి విద్యార్థికి అందించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని స్పష్టం చేశారు.
వామపక్ష విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లలో విద్యా హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టడం, నాణ్యమైన ఉచిత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు.
జూలై 10న నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాస్వామ్యవాదులు స్వచ్ఛందంగా సహకరించి విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ బంద్‌కు సమాజంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి వడ్లూరి శ్రీకాంత్‌తో పాటు ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు, యువజన ప్రతినిధులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.