ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందిన బాన్సుడే రాహుల్ ను బేసిక్ ట్యుటోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ సిబ్బంది మాట్లాడుతూ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడంలో విద్యా, మీడియా పాత్ర అనే సమకాలీన అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించడం అభినందనీయమని అన్నారు. రాహుల్ ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తూ ఎంతోమంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాదవ్ దీపక్, ఏ అరుణ్, ఏం. మహేందర్, జి ప్రమోద్ కుమార్, కే రమేష్, వేంకటాచారి, సాయి, డా,, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

బేసిక్ ట్యుటోరియల్ ఆధ్వర్యంలో రాహుల్ కు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందిన బాన్సుడే రాహుల్ ను బేసిక్ ట్యుటోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ సిబ్బంది మాట్లాడుతూ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడంలో విద్యా, మీడియా పాత్ర అనే సమకాలీన అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించడం అభినందనీయమని అన్నారు. రాహుల్ ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తూ ఎంతోమంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాదవ్ దీపక్, ఏ అరుణ్, ఏం. మహేందర్, జి ప్రమోద్ కుమార్, కే రమేష్, వేంకటాచారి, సాయి, డా,, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

