✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా
అనపర్తి, జూలై 6: అనపర్తి మండలం రామవరంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, తొలి అధ్యక్షుడు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, జాతీయవాదం కోసం చేసిన సేవలను ఎమ్మెల్యే నల్లమిల్లి కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ, బిక్కవోలు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


