కావలి పట్టణం బృందావనo హౌసింగ్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వార్షిక కుంభాభి షేక మహోత్సవ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమం చివరి రోజు కావడంతో ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి , కర్నూలు కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి తటవర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్వాహకులు శ్రీరాం మాల్యాద్రి,జీ వి, బచ్చు వీరస్వామి,ఏడుకొండలు,జలదంకి రమణయ్య, అర్చకులు ఎమ్మెల్యే కి స్వాగతం పలికి శాలువాతో సత్కరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదoలు అందజేసి వేద పండితులుచే ఆశీర్వాచనాలు అందజేశారు. సోమిశెట్టి ని ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసిన ఆర్యవైశ్య రాష్ట్ర నేత తటవర్తిరమేష్ ఆయన రాక సందర్భంగా బృందావనం కాలనీ వద్ద ఆర్యవైశ్య ప్రముఖులు, యువతతో కలిసి భారీ స్వాగతం పలికారు. రమేష్ ఆధ్వర్యంలో కావలి వైశ్యులు ఏకత్రాటి పై నడిచి పలు విజయాలు సాధించాలని కోరారు.టి.జి.వెంకటేష్ నాయకత్వంలో రాష్ట్రంలో ఆర్యవైశ్యు కు అన్ని రకాలుగా అండదండలు ఉన్నాయని సోమిశెట్టి తెలిపారు. బృందావనం లో శ్రీవారి ఆలయంలో పవిత్రంగా కార్యక్రమం చేపడుతున్నశ్రీరాంమాల్యాద్రి బృందం ను అభినందించారు.



