ఆసిఫాబాద్: కొమురం భీం పున్నమి ప్రతినిధి , లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.*ఆసిఫాబాద్ కాంగ్రస్ పార్టీ ఇంచార్జ్ అజ్మీరా శామ్ నాయక్ గారు* *డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క*, కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రేమ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలను ఏకం చేస్తూ యువత, రైతులు, కార్మికులు, మహిళల సమస్యలను దేశవ్యాప్తంగా ప్రస్తావించారని కొనియాడారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ ప్రజా నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించే శక్తి కలిగిన నేత అని, ఆయన అడుగుజాడల్లో అందరం కలిసి నడుద్దాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పర్సన్ ఇరుకుల మంగ, వైస్ చైర్మన్ గాజుల రవీందర్, డీసీసీ ఉపాధ్యక్షుడు తరుఖ్, ప్రధాన కార్యదర్శిలు గాద వేణి మల్లేష్, కార్యదర్శి సోమయ్య,నాంపెల్లి శంకర్,మున్సిపల్ ప్లోర్ లీడర్ అబ్దుల్లా భాయ్, కౌన్సిలర్ జాడి వినోద్,డైరెక్టర్ లు మారుతి పటేల్, విశ్వనాథ్, జక్కన్న,వాంకిడి ఉప సర్పంచ్ దీపక్,కాంగ్రెస్ నాయకురాలు విజయ,సీనియర్ నాయకులు తన్ను భాయ్, ఇల్లూరి రాము, హరీష్, భాను చందర్, నైతం మోహన్, నిజం,శంకర్ పటేల్,ఇమ్రాన్,నైతం ప్రభాకర్,యూత్ కాంగ్రెస్ ఎరగల సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
అజ్మీరా శామ్ నాయక్ గారి క్యాంపు కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్*

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు
ఆసిఫాబాద్: కొమురం భీం పున్నమి ప్రతినిధి , లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.*ఆసిఫాబాద్ కాంగ్రస్ పార్టీ ఇంచార్జ్ అజ్మీరా శామ్ నాయక్ గారు* *డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క*, కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రేమ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలను ఏకం చేస్తూ యువత, రైతులు, కార్మికులు, మహిళల సమస్యలను దేశవ్యాప్తంగా ప్రస్తావించారని కొనియాడారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ ప్రజా నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించే శక్తి కలిగిన నేత అని, ఆయన అడుగుజాడల్లో అందరం కలిసి నడుద్దాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పర్సన్ ఇరుకుల మంగ, వైస్ చైర్మన్ గాజుల రవీందర్, డీసీసీ ఉపాధ్యక్షుడు తరుఖ్, ప్రధాన కార్యదర్శిలు గాద వేణి మల్లేష్, కార్యదర్శి సోమయ్య,నాంపెల్లి శంకర్,మున్సిపల్ ప్లోర్ లీడర్ అబ్దుల్లా భాయ్, కౌన్సిలర్ జాడి వినోద్,డైరెక్టర్ లు మారుతి పటేల్, విశ్వనాథ్, జక్కన్న,వాంకిడి ఉప సర్పంచ్ దీపక్,కాంగ్రెస్ నాయకురాలు విజయ,సీనియర్ నాయకులు తన్ను భాయ్, ఇల్లూరి రాము, హరీష్, భాను చందర్, నైతం మోహన్, నిజం,శంకర్ పటేల్,ఇమ్రాన్,నైతం ప్రభాకర్,యూత్ కాంగ్రెస్ ఎరగల సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అజ్మీరా శామ్ నాయక్ గారి క్యాంపు కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్*

