(పున్నమి జిల్లా ప్రతినిధి
పువ్వాడ నాగేంద్ర కుమార్ )
ఖమ్మం, జూన్ భారతదేశాన్ని అత్యధిక రోజులు పరిపాలించిన ప్రధానిగా తొలి ప్రధాని జవహర్లల్ నెహ్రు రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించిన గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఖమ్మంలోని స్వయంభూశ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధి, సంక్షేమం, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య యాదవ్, బీజేపీ అర్బన్ టౌన్ అధ్యక్షులు వాగదాని రామకృష్ణ, ఎండోమెంట్ సెల్ కన్వీనర్ ఈశ్వరప్రగడ రామారావు, మంద సరస్వతి, మారుతి వీరభద్ర ప్రసాద్, బోయినపల్లి సురేష్, రుద్రగాని మాధవ్, తాజ్నోత్ భద్రం, దాసరి వీరభద్రం, మణి, నాగమణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



