రాజస్థాన్లో అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న గ్రామస్తులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఆరుగురు గాయపడ్డారు. అజిత్పురా-కుజేటా ప్రాంతంలో 300 రోజులుగా కొనసాగుతున్న నిరసనలో పాల్గొంటున్న గ్రామస్తులపై రాళ్లు, తుపాకులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో జైపూర్ ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా నిరసన.. కాల్పుల్లో ఆరుగురికి గాయాలు
రాజస్థాన్లో అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న గ్రామస్తులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఆరుగురు గాయపడ్డారు. అజిత్పురా-కుజేటా ప్రాంతంలో 300 రోజులుగా కొనసాగుతున్న నిరసనలో పాల్గొంటున్న గ్రామస్తులపై రాళ్లు, తుపాకులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో జైపూర్ ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

