Sunday, 31 May 2026
  • Home  
  • ఈడీ అధికారులపై దాడి కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ
- News

ఈడీ అధికారులపై దాడి కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ

కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాల అనంతరం అధికారులపై జరిగిన దాడి కేసులో ఐదుగురు సీపీఎం కార్యకర్తలకు కోర్టు బెయిల్ నిరాకరించింది. సోదాలు ముగించుకుని తిరిగి వెళ్తున్న ఈడీ అధికారులపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు విధుల్లోనే ఉన్నారని, అందువల్ల ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించారనే అభియోగాలు వర్తిస్తాయని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ ఘటనలో ఇప్పటికే 25 మందిని అరెస్టు చేశారు. సుమారు 300 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం కేరళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాల అనంతరం అధికారులపై జరిగిన దాడి కేసులో ఐదుగురు సీపీఎం కార్యకర్తలకు కోర్టు బెయిల్ నిరాకరించింది. సోదాలు ముగించుకుని తిరిగి వెళ్తున్న ఈడీ అధికారులపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు విధుల్లోనే ఉన్నారని, అందువల్ల ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించారనే అభియోగాలు వర్తిస్తాయని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ ఘటనలో ఇప్పటికే 25 మందిని అరెస్టు చేశారు. సుమారు 300 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం కేరళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.