నాగర్కర్నూల్/కోడేరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుల నడుం విరుస్తోందని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.శివశంకర్ ధ్వజమెత్తారు. మండల పరిధిలోని జనుంపల్లిలో సోమవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంధన ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరిగి పేదలు బతికే పరిస్థితి లేదన్నారు. వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో ఈశ్వర్, అశోక్, శరత్, నరహరి తదితరులు పాల్గొన్నారు


