పరిశ్రమల ఏర్పాటుతో గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడి, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు.
శుక్రవారం మండలం లోని పుల్లాయపల్లి గ్రామం సమీపంలో రిలయన్స్ సీబీజీ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూములను అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశ్రమ ఏర్పాటుపై ప్రజల అభ్యంతరాలు, సందేహాలను విని అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూ కేటాయింపుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు రామ్మోహన్, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు
పరిశ్రమల ఏర్పాటుతో గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడి, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. శుక్రవారం మండలం లోని పుల్లాయపల్లి గ్రామం సమీపంలో రిలయన్స్ సీబీజీ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూములను అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశ్రమ ఏర్పాటుపై ప్రజల అభ్యంతరాలు, సందేహాలను విని అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూ కేటాయింపుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు రామ్మోహన్, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

