26న జరిగే మహాధర్నాను అందరం విజయవంతం చేద్దాం. తప్పకుండా అందరూ రావాలి. అందరి భవిష్యత్తు కోసం కొందరు కొట్లాడితే రాదు. అందరూ ముందుకు రావాలి మీ వంతుగా నిరసన కార్యక్రమాలలో పాలుపంచుకోవాలి. అప్పుడే ప్రభుత్వంలో చలనం వస్తుంది మనకు న్యాయం జరుగుతుంది. గురువారం లేదా శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఎమ్మెల్యేలకు మరియు జిల్లా కేంద్రాలలో కలెక్టర్లకు ఒక వినతి పత్రం మాకు వేతనం కావాలని, సమర్పిద్దాం.తద్వారా మన సమస్యపై అందరి నాయకులకు తెలియపరిచినట్లు అవుతుంది. మహాధర్నకు ముందుగా ఈ కార్యక్రమం చేయడం వలన మనకు ఎంతో కొంత లబ్ది జరుగుతుంది. మన తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్ అసోసియేషన్ తరఫునుంచి ప్రతి జిల్లా AD గార్లకు మరియు మన తెలంగాణ స్టేట్ JD మేడంకి మరియు తెలంగాణ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ హనుమంతు గాంధీ గారికి మరియు తెలంగాణ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్ ఐఏఎస్ గారికి అందరికీ పేరుపేరునా మన యొక్క లెటర్ హెడ్ మీద నుంచి మేము ఇంత అమౌంట్ కి పని చేయడం కుదరదు, ఇది మాకు ఏ విధంగా కూడా సాధ్యపడదు, అనే ఒక ఉద్దేశాన్ని రాస్తూ ప్రతి ఒక్కరికి లెటర్ పంపించడం జరుగుతుంది. ఈ లెటర్ లో ముఖ్య ఉద్దేశం ఏందంటే, ఏ విధంగా నష్టపోయాము, ఇంకా ఏ విధంగా నష్టపోతామో మాకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి మాకు ఎలాంటి సిచువేషన్ ని బట్టి పనిచేయాలి ఎంత అమౌంట్ ఇస్తే వర్క్ అవుట్ అవుతుంది. అనే క్యాలిక్యులేషన్ తో పాటు వాళ్లకు లెటర్ పెట్టడం జరుగుతుంది, ఒక్క డిస్టిక్ నుంచి అని కాదు మొత్తం స్టేట్ లో ఉన్న 6,500 మందిని ఉద్దేశించి ఆ లెటర్లో రాయడం జరుగుతుంది. దయచేసి అందరూ హాజరవ్వాలని కోరారు


